ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి--జిల్లా కలెక్టర్ ,ఎస్పీ
ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంలో టెంపుల్ సిటీ వద్ద వేద పాఠశాల శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు లు పకడ్బందీగా పూర్తి చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ,జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.పోలీస్ ,రెవెన్యూ శాఖ,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,ఇ ఇ అర్ అండ్ బి ,ఎస్సీ ఇరిగేషన్, ట్రాన్స్ పోర్ట్,ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయితీ,ఈ ఈ పంచాయతీ రాజ్,వైద్య శాఖ, ట్రాన్స్ కో ,హార్టికల్చర్ డిపిఆర్ఓ,సివిల్ సప్లై , ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు తమకి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ వివిధ శాఖలు అధికారులు సంపూర్ణ సమన్వయంతో పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. టెంపుల్ సిటీ వద్ద హెలిప్యాడ్ అన్ని ఏర్పాట్లుచేయాలని ఆర్ అండ్ బి అధికారులను, భద్రత ఏర్పాట్లు,శాంతి భద్రతలు, పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును,భారీ కేడింగ్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులను, అగ్నిమాపక పరికరాలను ,సేవలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖను, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖను,రోడ్ల మరమ్మత్తుల పనులను అర్.అండ్.బి,అధికారులు ,శానిటేషన్ పనులను పూర్తి చేయాలని,మున్సిపాలిటీ,జిల్లా పంచాయితీ శాఖ,ఈ ఏర్పాట్ల ను పక్కాగా నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ,రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, పోలీస్ అధికారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.