www.ntodaynews.com
AP: లాకప్ డెత్ బాధిత కుటుంబానికి వైసీపీ రూ.20 లక్షల ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైన గాదె సాయికృష్ణ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు ఆయన తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు.
ఈ సందర్భంగా సాయికృష్ణ కుటుంబానికి పార్టీ తరఫున రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు.