BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Jul, 2026 - 08:48 PM
75 వీక్షణలు

మదనపల్లి | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

జిల్లాలోని జనసమ్మర్థం ఎక్కువగా ఉండే కూడళ్లు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సున్నిత ప్రాంతాలను డ్రోన్ నిఘా ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి నేరాలను అడ్డుకోవడమే ఈ ఆధునిక నిఘా వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను డ్రోన్ల ద్వారా గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని, లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అన్నమయ్య జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.