డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా..
మదనపల్లి | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
జిల్లాలోని జనసమ్మర్థం ఎక్కువగా ఉండే కూడళ్లు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సున్నిత ప్రాంతాలను డ్రోన్ నిఘా ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి నేరాలను అడ్డుకోవడమే ఈ ఆధునిక నిఘా వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను డ్రోన్ల ద్వారా గుర్తించి, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని, లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని అన్నమయ్య జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.