www.ntodaynews.com
ఈనెల 10 తర్వాత ఉపాధి హామీ కూలీల ఖాతాల్లోకి వేతనాలు
జాతీయం
ఆంధ్రప్రదేశ్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద జూన్ నెలలో సుమారు 14 నుంచి 20 లక్షల మంది కూలీలు పనులు చేశారు. అయితే, ఈ పథకం స్థానంలో 'వీబీ జీ రామ్ జీ' అనే కొత్త విధానం అమల్లోకి రావడంతో వేతనాల చెల్లింపుపై కూలీలలో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించిన వేతన నిధులను జూలై 10 తర్వాత విడుదల చేసి, కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి హామీ కూలీలు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.