www.ntodaynews.com
పహల్గాం ఉగ్రదాడి కేసు ఛార్జిషీట్లో LeT చీఫ్ పేరు
జాతీయం
/
తెలంగాణ
జాతీయం | NTODAY NEWS
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో హఫీజ్ సయీద్ పేరును చేర్చింది.
ఈ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, వారిలో హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీయగా, ప్రపంచ దేశాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి.
ఈ ఘటన అనంతరం భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద మౌలిక వసతులపై ప్రతిదాడులు చేపట్టింది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.