www.ntodaynews.com
లగ్జరీ రిసార్ట్లో వ్యభిచారం.. 52 మంది అరెస్ట్
జాతీయం
అంతర్జాతీయం
డెహ్రాడూన్ | NTODAY NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యభిచార ముఠా గుట్టును ఉత్తరాఖండ్ పోలీసులు ఛేదించారు. ప్రసిద్ధ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ సమీపంలోని రామ్నగర్ ప్రాంతంలో ఉన్న ఓ విలాసవంతమైన రిసార్ట్పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
దాడి సమయంలో రిసార్ట్లో వ్యభిచార కార్యకలాపాలతో పాటు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, ఒక మైనర్తో పాటు మొత్తం 10 మంది మహిళలను పోలీసులు రక్షించారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా కార్యకలాపాల వెనుక ఉన్న నిర్వాహకులు, ఇతర సంబంధిత వ్యక్తులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.