జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీకై టీయూడబ్ల్యూజే (ఐ జే యు) ఎంఈఓ కు వినతి
ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నజర్నలిస్టుల పిల్లల జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా జిల్లా విద్యాధికారులు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిట్యాల మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల విద్యాధికారి సైదా నాయక్కు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం, విద్యాశాఖ సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఇచ్చేలా ఉన్నతాధికారులు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శన, వినతిపత్రం అందజేసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న, మండల అధ్యక్షుడు మేండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, ఉపాధ్యక్షుడు ఏళ్ల వెంకన్న, సహాయ కార్యదర్శి కూనూరు మధు పాల్గొన్నారు. అలాగే యూనియన్ సభ్యులు మిర్యాల ప్రకాష్, జిట్ట మల్లేష్, అమరోజు వెంకన్న, చికిలంమెట్ల మెహర్ బాబు, కాలిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.