ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
| తెలంగాణ | NTODAY NEWS
నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్ గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు.
పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ప్రశాంత్ (35), సంధ్య దంపతులు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సంధ్య, ప్రియుడు అనిల్ మరో వ్యక్తి వెంకటసాయి సహాయంతో ప్రశాంత్ హత్యకు పథకం రచించారు.
ముందుగా ప్రశాంత్ను ఇంటి పైకప్పు నుంచి తోసివేయగా, అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తర్వాత, సెలైన్ బాటిల్లో టాయిలెట్ క్లీనర్ కలిపి అతనికి ఎక్కించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, నిందితుల పాత్ర బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి భార్య సంధ్యతో పాటు అనిల్, వెంకటసాయిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.