BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

వివాహేతర సంబంధం కోసం భర్త హత్య.. హార్పిక్‌ను నరాల్లోకి ఎక్కించి దారుణం

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 08:06 PM
49 వీక్షణలు

నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్, సంధ్య దంపతుల మధ్య వివాహేతర సంబంధాల కారణంగా ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీశాయి.

పోలీసుల వివరాల ప్రకారం, సంధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని భర్త ప్రశాంత్ ప్రశ్నించడంతో అతడిని శాశ్వతంగా తొలగించుకోవాలని సంధ్య కుట్ర పన్నింది.

పథకం ప్రకారం ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి అతడిపై దాడి చేసి భవనం పై నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే అతడిని ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ హార్పిక్‌ను సిరంజిలోకి తీసుకుని నరాల్లోకి ఎక్కించినట్లు పోలీసులు గుర్తించారు. విషపూరిత రసాయనం శరీరంలోకి చేరడంతో ప్రశాంత్ కొద్దిసేపటికే మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.