రైతులు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్
నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తనిఖీ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్యాయం జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు పై స్పందించిన యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను శుక్రవారం రోజున తనిఖీ చేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు కొనుగోలు కేంద్రంలో నాలుగు కాంట మిషన్లు ఉండడం, కాంట మిషన్లో వేరువేరుగా తూకాలు చూపించడంతో కాంటాలు సరిగా పనిచేయడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రం లో కాంటాల పరిస్థితిపై సీఈఓ జయేందర్, కొనుగోలు సెంటర్ నిర్వాహకులను వివరణ ఇవ్వాలన్నారు. గ్రామ రైతులు మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యాన్ని మిల్లర్లు తమ స్వార్థం కోసం మా ధాన్యాన్ని బీ గ్రేడ్గా మార్చుతున్నారని, అదనంగా రెండు కిలోల వరకు తూకం వేయడంతో పాటు ధాన్యం బస్తాల్లో మూడు కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో అదనపు కలెక్టర్ వెంటనే రైస్ మిల్లులపై తగు చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రైతులని ఇబ్బంది పెడితే మిల్లర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు కొనుగోలు జిల్లాలోనూ ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న కాంటాల పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలట్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చీర సత్యనారయణ,డిసిఎస్ ఓ రోజా రాణి,డిసిఓ మురళి రమణ, మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావు,డిప్యూటీ తాహసిల్దార్ సివిల్ సప్లై నర్సింగరావు, ఏఈఓ మౌనిక, పిఎసిఎస్ సీఈవో జయేందర్, రామిడి జంగారెడ్డి, మల్యాల గ్రామ ఉపసర్పంచ్ మైలారం సుదర్శన్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.