www.ntodaynews.com
విస్సన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ స్టేజి సమీపంలో మంగళవారం జరిగిన బైక్ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన చల్లపల్లి శృతి (28)గా గుర్తించారు.
ప్రమాదం తీవ్రతకు శృతి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటనతో చిత్తపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శృతి మృతితో కన్నీరుమున్నీరవుతున్నారు.