BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

జి.ఓ. ఎంఎస్. నెం. 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Jul, 2026 - 03:14 PM
70 వీక్షణలు

అన్నమయ్య జిల్లా.. పుంగనూరు 

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం. 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో దస్తావేజుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.పుంగనూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం. 396 ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ...ఈ నిర్ణయం అమలులోకి వస్తే దస్తావేజుల రచయితల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు, ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న దస్తావేజుల రచయితల హక్కులను పరిరక్షించాలని కోరారు.

జి.ఓ. ఎంఎస్. నెం. 396ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజుల రచయితల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.