BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

HPCL డిపోలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: యూనియన్ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M.Seethaiah గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Jul, 2026 - 04:05 PM
13 వీక్షణలు

బాకరాపేట | NTODAY NEWS

బాకరాపేట సమీపంలోని హెచ్‌పీసీఎల్ (HPCL) డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, హెల్పర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని హెచ్‌పీసీఎల్ డ్రైవర్ అండ్ హెల్పర్ యూనియన్ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

శుక్రవారం డిపోలో కార్మికులతో కలిసి నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా డిపోలో నెలకొన్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, విశ్రాంతి వసతులు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారిందన్నారు.

డ్రైవర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇంధనాన్ని సురక్షితంగా రవాణా చేయాలంటే వారిపై అనవసర ఒత్తిడి లేకుండా అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా లోడింగ్ ప్రక్రియను సాయంత్రంలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, కార్మికులను గౌరవప్రదంగా చూడడంతో పాటు వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు.

ఈ సందర్భంగా స్పందించిన డిపో డీఎం మాట్లాడుతూ, తాగునీటి కుళాయి ఏర్పాటును అదే రోజు సాయంత్రంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. మిగిలిన వసతుల ఏర్పాటుకు పై అధికారుల అనుమతితో రానున్న నాలుగు నెలల్లో అవసరమైన నిర్మాణ పనులు చేపట్టి కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కూడా వివరించారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ యూనియన్ కార్యదర్శి వేమ నారాయణరెడ్డి, ఆర్టీయూ నగర కార్యదర్శి మడగలం ప్రసాద్, దస్తగిరి, నాగూర్, మహేంద్ర, వెంకటయ్య, కమల్, రజాక్, రమణనాయుడు, ప్రతాప్ రెడ్డి, మునిరెడ్డి, వెంకటేష్, విజయ్‌కుమార్‌తో పాటు హెచ్‌పీసీఎల్ డ్రైవర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.