BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

పేరంపేటలో దారుణ హత్య.. ఘటనాస్థలికి పరుగెత్తిన ఎమ్మెల్యే రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 04:50 PM
42 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కారుమూడి దుర్గారెడ్డి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే రోషన్ కుమార్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

మృతదేహాన్ని చూసిన ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామస్తులను అడిగి హత్యకు దారితీసిన కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారుల నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.

అనంతరం మృతుడు కారుమూడి దుర్గారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, వారికి ధైర్యం చెప్పారు. దుర్గారెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా పూర్తి అండదండలు ఉంటాయని భరోసా కల్పించారు.

పెరంపేట గ్రామంలో చోటుచేసుకున్న ఈ హత్య ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.