బీసీ కమిషన్ చైర్మన్కు కల్లుగీత కార్మికుల వినతి.. కార్పొరేషన్ ఏర్పాటు, ఎక్స్గ్రేషియా అమలుకు డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కలిసి గీత కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు వాకా వెంకటేశ్వరావు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కల్లుగీత ఆర్థిక సహకార సంస్థ (కార్పొరేషన్) ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గతంలో అమలులో ఉన్న కల్లుగీత కార్మికుల ఎక్స్గ్రేషియా భీమా పథకాన్ని 2018 నుంచి 2026 వరకు కొనసాగించి, అర్హులైన కుటుంబాలకు వెంటనే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
గీత కార్మికుల జీవన భద్రత, ఉపాధి పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ పలు సమస్యలను వివరించిన మెమోరాండంను కమిషన్ చైర్మన్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పంది వెంకట్రావు, వడ్డేబోయిన జానకిరామ్, వడ్డేబోయిన శ్రీను, మోటపోతుల చిన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.