BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

విద్యార్థులకు పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Jul, 2026 - 06:06 PM
151 వీక్షణలు

విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తుందని చిట్యాల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం అన్నారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మంగళవారం సర్పంచ్ కాటం వెంకటేశం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి వారితో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో మెనూ రేట్లను పెంచిందన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే భోజనం చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల ఆహార నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు హరీష్ రెడ్డి, ప్రశాంత్, నరేష్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.