ఏకగ్రీవంగా చిట్యాల మండల ఉన్ని పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం
నల్గొండ జిల్లా చిట్యాల మండల ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం నూతన మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగానే ఎన్నిక కావడం విశేషం. సంఘం అధ్యక్షుడిగా గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్, ఉపాధ్యక్షుడుగా కంకల బీరయ్య (ఎల్లంబావి), కార్యదర్శి కొండె వెంకటేష్ (ఏపూర్)
కోశాధికారిగా దిందే ఆడవయ్య (కాట్రేవు) డైరెక్టర్లుగా కంకల బుగ్గమ్మ (గుండ్రాంపల్లి), బండ కేతమ్మ (గుండ్రాంపల్లి), వస్పరి జహంగీర్ (అంతమ్మగూడెం), కొండె మహేష్ (వేలిమినేడు), బాలం జంగయ్య (ఎల్లంబావి) ఎన్నికయ్యారు కాసు గణేష్ నేతృత్వంలోని నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి, కార్యవర్గ సభ్యులకు వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని, సభ్యుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తూ మండలంలోనే ఆదర్శ సంఘంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు.