BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

నాణ్యత లేని ఆహారంపై ఆగ్రహం.. గడువు ముగిసిన నూనె ప్యాకెట్ల స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 07:30 PM
70 వీక్షణలు

విద్యార్థులు, చిన్నారులకు నాణ్యమైన ఆహారమే అందించాలి: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమల దేవి

అన్నమయ్య జిల్లా, జూలై 7: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజమల దేవి మంగళవారం అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ చౌక దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

వాల్మీకిపురం అంగన్‌వాడీ కేంద్రంలో కోడిగుడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆమె, ప్రమాణాలకు అనుగుణంగా లేని గుడ్లను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

గుర్రంకొండ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గడువు ముగిసిన వంటనూనె ప్యాకెట్లు గుర్తించిన గంజమల దేవి, వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

చింతపర్తి జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసిన ఆమె, భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలికిరి, పీలేరు ప్రాంతాల్లోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, ప్రభుత్వ చౌక దుకాణాలను తనిఖీ చేసి విద్యార్థులు, చిన్నారులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.