BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

బొగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:38 PM
72 వీక్షణలు

విజయనగరం జిల్లాలో నిర్మాణం పూర్తిచేసుకున్న బొగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి , విజయనగరం ఎంపీ , జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అద్భుతంగా నిర్మితమైందని, ఉత్తరాంధ్రకు మణికిరీటంగా నిలిచే విధంగా బొగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. డిసెంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ఆరు నెలల ముందుగానే నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

దేశంలోనే ఇంత తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకున్న విమానాశ్రయం ఇదేనని, ఇచ్చిన మాట ప్రకారం కేవలం రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి తెలిపారు. అలాగే ఏరో డ్రోన్ లైసెన్స్ కూడా ఈ రోజే లభించిందని వెల్లడించారు.

విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి  చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించామని, ఇందుకోసం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరామని చెప్పారు. అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.