BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బొగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:38 PM
38 వీక్షణలు

విజయనగరం జిల్లాలో నిర్మాణం పూర్తిచేసుకున్న బొగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి , విజయనగరం ఎంపీ , జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అద్భుతంగా నిర్మితమైందని, ఉత్తరాంధ్రకు మణికిరీటంగా నిలిచే విధంగా బొగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. డిసెంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ఆరు నెలల ముందుగానే నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

దేశంలోనే ఇంత తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకున్న విమానాశ్రయం ఇదేనని, ఇచ్చిన మాట ప్రకారం కేవలం రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి తెలిపారు. అలాగే ఏరో డ్రోన్ లైసెన్స్ కూడా ఈ రోజే లభించిందని వెల్లడించారు.

విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి  చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించామని, ఇందుకోసం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరామని చెప్పారు. అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.