BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

బొగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:38 PM
10 వీక్షణలు

విజయనగరం జిల్లాలో నిర్మాణం పూర్తిచేసుకున్న బొగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి , విజయనగరం ఎంపీ , జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అద్భుతంగా నిర్మితమైందని, ఉత్తరాంధ్రకు మణికిరీటంగా నిలిచే విధంగా బొగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. డిసెంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ఆరు నెలల ముందుగానే నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

దేశంలోనే ఇంత తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకున్న విమానాశ్రయం ఇదేనని, ఇచ్చిన మాట ప్రకారం కేవలం రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి తెలిపారు. అలాగే ఏరో డ్రోన్ లైసెన్స్ కూడా ఈ రోజే లభించిందని వెల్లడించారు.

విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి  చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించామని, ఇందుకోసం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరామని చెప్పారు. అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.