ఏపీలో రాజకీయ వేడి పెంచిన చంద్రబాబు వ్యాఖ్యలు.. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల హీట్ మొదలైంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి, ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆయన స్పష్టం చేశారు.
"ఈ ఎన్నికలు సాధారణం కావు.. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి మండలంలో విజయం సాధించాల్సిందే. ఒక్క స్థానాన్ని కూడా వదులుకోరాదు" అంటూ పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందని, పనితీరు ఆధారంగానే పదవులు, బాధ్యతలు కేటాయిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.