వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు
పాలకుర్తి | NTODAY NEWS
వరంగల్ పోలీస్ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి శ్రీమతి ఎన్. శ్వేతా రెడ్డిని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి నూతన బాధ్యతల స్వీకరణకు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చేపట్టే చర్యలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అలాగే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన శాంతిభద్రతల అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగించాలని ఎమ్మెల్యే కోరారు.
దీనికి స్పందించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా రెడ్డి, ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఈ మర్యాదపూర్వక సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగింది.