తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్యపై ఏపీలో జీరో ఎఫ్ఐఆర్.. రాజకీయ దుమారం..!
తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలి పోలీసులు హైదరాబాద్కు వెళ్లిన సందర్భంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కేవీఆర్ను సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసులు తీసుకెళ్తుండగా, తన భర్తను కాపాడుకునేందుకు అడ్డుకున్న ఆయన భార్య విజయలక్ష్మిపై ఏపీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బొబ్బిలి సీఐ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు, తదుపరి విచారణ కోసం ఆ కేసును హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
అయితే, సివిల్ డ్రెస్సులో వచ్చిన వ్యక్తులు తన భర్తను ఎత్తుకుపోతుండగా అడ్డుకున్న మహిళపైనే కేసు నమోదు చేయడంపై పలు జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చ సాగుతోంది.