BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్యపై ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్.. రాజకీయ దుమారం..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 02:27 PM
69 వీక్షణలు

తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలి పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లిన సందర్భంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కేవీఆర్‌ను సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసులు తీసుకెళ్తుండగా, తన భర్తను కాపాడుకునేందుకు అడ్డుకున్న ఆయన భార్య విజయలక్ష్మిపై ఏపీ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో బొబ్బిలి సీఐ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు, తదుపరి విచారణ కోసం ఆ కేసును హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.

అయితే, సివిల్ డ్రెస్సులో వచ్చిన వ్యక్తులు తన భర్తను ఎత్తుకుపోతుండగా అడ్డుకున్న మహిళపైనే కేసు నమోదు చేయడంపై పలు జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చ సాగుతోంది.