www.ntodaynews.com
ఆస్తి వివాదం రక్తపాతం.. పేరంపేటలో దారుణ హత్య..!
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో మంగళవారం దారుణ హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన కారుమూడి దుర్గా రెడ్డి హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
గ్రామస్థుల వివరాల ప్రకారం, కుటుంబ ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో మృతుడి అన్న కుమారుడే ఈ హత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.
కుటుంబ ఆస్తి వివాదం చివరికి ప్రాణం తీసిన ఈ ఘటన పేరంపేట గ్రామంలో విషాద ఛాయలు నింపింది.