BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

తెరుచుకున్న బడులు.. మొదలైన ఫుడ్ పాయిజన్లు!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
15 వీక్షణలు

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

తెలంగాణలోని బీర్కూర్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తినడంతో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

రోజువారీ మాదిరిగానే రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడడం ప్రారంభించారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే బాధిత విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగిన వంట నూనెను పదేపదే వినియోగించడం, నాసిరకం ఆహార పదార్థాలను ఉపయోగించడమే ఫుడ్ పాయిజన్‌కు కారణమని వారు ఆరోపిస్తున్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తగా, ఘటనపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.