BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం.. పాఠశాలల్లో పండుగ వాతావరణం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
11 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 17న సందడిగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరంలో నిర్వహించే సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సందేశం ఇవ్వనున్నారు.

ఈ సమావేశంలో ప్రతి విద్యార్థికి సంబంధించిన సమగ్ర విద్యా ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు అందజేయనున్నారు. పిల్లల చదువు, హాజరు, ప్రతిభ, నైపుణ్యాలు, క్రీడలు, ప్రవర్తన తదితర అంశాలపై పూర్తి వివరాలను తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకే వేదికపైకి రావడం ద్వారా విద్యా వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది పలకనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

"మన పిల్లల భవిష్యత్తు కోసం.. మన పాఠశాలకు తప్పక వెళ్లాలి" అంటూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యాశాఖ పిలుపునిచ్చింది.