BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం.. పాఠశాలల్లో పండుగ వాతావరణం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
75 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 17న సందడిగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంపచోడవరంలో నిర్వహించే సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సందేశం ఇవ్వనున్నారు.

ఈ సమావేశంలో ప్రతి విద్యార్థికి సంబంధించిన సమగ్ర విద్యా ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు అందజేయనున్నారు. పిల్లల చదువు, హాజరు, ప్రతిభ, నైపుణ్యాలు, క్రీడలు, ప్రవర్తన తదితర అంశాలపై పూర్తి వివరాలను తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒకే వేదికపైకి రావడం ద్వారా విద్యా వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది పలకనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

"మన పిల్లల భవిష్యత్తు కోసం.. మన పాఠశాలకు తప్పక వెళ్లాలి" అంటూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని విద్యాశాఖ పిలుపునిచ్చింది.