BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

రెడ్డిగూడెం లో వైసీపీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:20 AM
18 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

పార్టీ మండల అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి, దళితుల సాధికారత, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ దేశ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు మహానేత సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చాట్ల రాబర్ట్, జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ గుడిసె ప్రభాకర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టకొయ్య రాము, రెడ్డిగూడెం పార్టీ అధ్యక్షుడు పైడిమర్ల శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్‌కు ఘన నివాళులర్పించారు.