₹300 కోట్ల అక్రమాస్తుల కేసు.. హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్
హైదరాబాద్లో సంచలనం రేపిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో హైదరాబాద్ PCSలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డిని ACB అధికారులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులతో పాటు 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం స్వాధీనం చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని ACB పేర్కొంది. డీఎస్పీ భీమ్రెడ్డి అక్రమాస్తుల మూలాలు, పెట్టుబడుల వివరాలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.