BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

₹300 కోట్ల అక్రమాస్తుల కేసు.. హైదరాబాద్ డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:46 AM
41 వీక్షణలు

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో హైదరాబాద్ PCSలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిని ACB అధికారులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ ఆస్తులతో పాటు 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం స్వాధీనం చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని ACB పేర్కొంది. డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల మూలాలు, పెట్టుబడుల వివరాలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది.