ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు పెండింగ్ లేకుండా పరిశీలించి పరిష్కరించాలి --అదనపు కలెక్టర్ భాస్కరరావు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి,వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 71 అర్జీలను స్వీకరించారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.అందులో రెవిన్యూ శాఖ 45, సంక్షేమ శాఖ 5, జిల్లా పరిషత్ 4, గ్రామీణ అభివృద్ధి 3, సర్వే ల్యాండ్స్ 3, హౌసింగ్ 2, అటవీశాఖ 2, పంచాయితీ 2, వ్యవసాయ, విద్య, ట్రాన్స్కో, కోపరేటివ్, ఎస్సీ డెవలప్మెంట్, శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు సాత్విక్, కృతిక, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ , జడ్పీ సీఈవో శోభారాణి, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.