www.ntodaynews.com
ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా పదవుల్లో విస్సన్నపేట నాయకులకు స్థానం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్గా విస్సన్నపేటకు చెందిన డి.టి. రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పి. శేషయ్య, జిల్లా సెక్రటరీగా ఎం. సరోజినీ దేవి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రామమోహనరావు, జిల్లా కార్యదర్శి ఎన్. నారాయణరావు, విస్సన్నపేట యూనిట్ అధ్యక్షుడు ఎన్. సూరిరాజు అభినందించారు. వారి నాయకత్వంలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.