www.ntodaynews.com
తిరువూరులో జూదగృహంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్, రూ.18,200 స్వాధీనం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు టౌన్లోని సుందరయ్య కాలనీలో నిర్వహిస్తున్న జూదగృహంపై తిరువూరు పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.18,200 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పేకాట వంటి జూద కార్యకలాపాలు వ్యక్తి, కుటుంబం, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.