www.ntodaynews.com
పొన్నూరులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..!
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను అర్బన్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ శివారులో పోలీసులు నిర్వహిస్తున్న పహారా సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో భారీగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.