గోవాలో హనీట్రాప్ హత్య.. మందులో మత్తుమందు కలిపి యువకుడిని చంపిన మహిళ..!
గోవాలో పరిచయమైన ఓ మహిళతో సరదాగా గడపాలని వెళ్లిన యువకుడు చివరకు హత్యకు గురయ్యాడు. కర్ణాటకలోని మాల్పేకు చెందిన సందీప్ ఎంజాయ్ చేసేందుకు గోవాకు వచ్చాడు. అక్కడ అక్షిత అలియాస్ రూపశ్రీ అనే మహిళను బుక్ చేసుకుని హోటల్కు వెళ్లాడు.
హోటల్లో ఇద్దరూ కలిసి మద్యం సేవించగా, అక్షిత అతడికి తెలియకుండా మందులో మత్తుమందు కలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మత్తులో నిద్రపోయిన సందీప్ను హత్య చేసి, అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సూట్కేస్లోని నగదును దోచుకుని పరారైంది.
సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన గోవా పోలీసులు, బెంగుళూరుకు చెందిన అక్షిత అలియాస్ రూపశ్రీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలపై విచారణ చేపట్టారు.
సరదాగా వెళ్లిన సందీప్కు గోవా ట్రిప్ చివరకు ప్రాణాలు తీసిన విషాదంగా మారింది.