BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

గోవాలో హనీట్రాప్ హత్య.. మందులో మత్తుమందు కలిపి యువకుడిని చంపిన మహిళ..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 12:46 PM
64 వీక్షణలు

గోవాలో పరిచయమైన ఓ మహిళతో సరదాగా గడపాలని వెళ్లిన యువకుడు చివరకు హత్యకు గురయ్యాడు. కర్ణాటకలోని మాల్పేకు చెందిన సందీప్ ఎంజాయ్ చేసేందుకు గోవాకు వచ్చాడు. అక్కడ అక్షిత అలియాస్ రూపశ్రీ అనే మహిళను బుక్ చేసుకుని హోటల్‌కు వెళ్లాడు.

హోటల్‌లో ఇద్దరూ కలిసి మద్యం సేవించగా, అక్షిత అతడికి తెలియకుండా మందులో మత్తుమందు కలిపినట్లు పోలీసులు వెల్లడించారు. మత్తులో నిద్రపోయిన సందీప్‌ను హత్య చేసి, అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సూట్‌కేస్‌లోని నగదును దోచుకుని పరారైంది.

సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన గోవా పోలీసులు, బెంగుళూరుకు చెందిన అక్షిత అలియాస్ రూపశ్రీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలపై విచారణ చేపట్టారు.

సరదాగా వెళ్లిన సందీప్‌కు గోవా ట్రిప్ చివరకు ప్రాణాలు తీసిన విషాదంగా మారింది.