www.ntodaynews.com
యాదమ్మకు నివాళులు అర్పించిన దైద రవీందర్
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
NTODAY NEWS నల్గొండ జిల్లాలో చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు శివనేని గూడెం లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గాదే యాదమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆమె నివాసానికి వెళ్లి గాదే యాదమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గార్లపాటి రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా బీసీ యువజన సంఘం కన్వీనర్ ఎట్ల మహలింగం యాదవ్, రుద్రవరం గణేష్, గాదే లింగస్వామి, వెంకన్న, శ్రీను, నవీన్, పరశురాములు పాల్గొన్నారు.