వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్
రైతును ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు శుక్రవారం రోజున బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి, బొమ్మలరామారం, చీకటి మామిడి వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు నెల రోజులుగా పడుతున్న బాధలను చూసి వారి తరపున వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి త్వరగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో అక్కడికి వచ్చిన మండల తహసిల్దార్ పి. శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని బి గ్రేడ్ గా మిల్లర్రు తీసుకోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారని అలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని తెలియజేశారు. సత్వరమే లారీలను పంపి త్వరగా ధాన్యాన్ని మిల్లుకు పంపే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గూదె బాల నర్సయ్య సర్పంచులు బట్కిర్ జ్యోతి బీరప్ప, కట్ట ఉమాదేవి శ్రీకాంత్ గౌడ్, తిరుమణి నాగరాజ్ గౌడ్, నోముల రాంరెడ్డి, దోకూరి ఐలయ్య, ఈగల బాలరాజ్, బోయిని నరసింహ, కొండోజు ఆంజనేయులు,కుశంగల సత్యనారాయణ,మచ్చ శ్రీనివాస్ గౌడ్, మెడబోయిన గణేష్,రాగుల బలరాం, పాచ్యానాయక్,రాజన్ నాయక్,ఎలబోయున జంగయ్య, కట్ట సాయి రెడ్డి,కుక్కుదువు ఉపేందర్ బొర్ర నరసింహ,పాషా,నరసింహ,శాదం భాస్కర్, కుమార్, రాసాల మల్లేష్ యాదవ్,రాజు, లక్ష్మారెడ్డి, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు