నకిరకంటి వంశీ కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గం .ప్రతినిధి వేణు
కిష్టపురం గ్రామంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
తొర్రూరు మండలం కిష్టపురం గ్రామానికి చెందిన నకిరకంటి వంశీ నిన్న మృతిచెందిన విషయం తెలుసుకున్న పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా వంశీ మృతి పట్ల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. వంశీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్, మండల పట్టణ సీనియర్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.