BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

రైతు భరోసా నిధుల జమపై కొత్త ట్విస్ట్.. అర్హులకే సాయం!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:36 PM
18 వీక్షణలు

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి దశలవారీ విధానానికి బదులుగా ఒకే విడతలో నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గత యాసంగి సీజన్‌లో రెండు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడంపై విమర్శలు రావడంతో, ఈసారి చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

కీలక మార్పులు ఇవే..

జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం.

సుమారు రూ.9 వేల కోట్ల వరకు నిధుల పంపిణీకి ఏర్పాట్లు.

కొత్త పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులను కూడా జాబితాలో చేర్చే అవకాశం.

ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించే ప్రతిపాదన పరిశీలనలో.

కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉన్నవారికే కాకుండా, వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే సాయం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన.

శాటిలైట్ సర్వే ఆధారంగా ఎంపిక?

రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన ప్రభుత్వం, గ్రామాల వారీగా సాగు విస్తీర్ణాన్ని గుర్తించింది. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడంతో భవిష్యత్తులో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఏడున్నర ఎకరాల పరిమితి, శాటిలైట్ సర్వే ఆధారంగా అర్హుల ఎంపిక వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో చివరకు ఎవరెవరికి రైతు భరోసా నిధులు జమ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.