www.ntodaynews.com
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆస్తులపై ఏసీబీ దాడులు
తెలంగాణ
/
నిజామాబాద్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డికి చెందిన ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. అసమాన ఆస్తుల కేసులో భాగంగా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
సోదాల్లో 4 ఇళ్లు, ఒక వాణిజ్య భవనం, 8 ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇంకా మూడు బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉండగా, వాటిలో ఉన్న ఆస్తుల వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ఈ మొత్తాన్ని మించి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.