ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రీ-ఉగాది వేడుకలు
ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రీ-ఉగాది వేడుకలు
ద్రావిడ విశ్వవిద్యాలయ విద్యార్థి మండలి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రీ-ఉగాది వేడుకలను అత్యంత ఉత్సాహంతో, సాంస్కృతిక వైభవంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మరియు పరిశోధకులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ద్రావిడ ప్రాంతపు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఎల్. సి. మల్లయ్య గారు మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. కిరణ్ కుమార్ గారు, డీన్,ఎకడమిక్ అఫైర్స్ ఆచార్య శ్యామల గారు హాజరయ్యారు.
కార్యక్రమంలో శ్రీ బాబుస్వామి గారు పంచాంగ శ్రవణం యొక్క ప్రాముఖ్యతను వివరించి, ఉగాది పండుగకు సంబంధించిన సాంప్రదాయ మరియు సాంస్కృతిక విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ ఎల్. సి. మల్లయ్య గారు మాట్లాడుతూ, ద్రావిడ సంస్కృతి అనేది అనేక భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు కలగలిసిన గొప్ప వారసత్వమని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్సవాలు విద్యార్థుల్లో ఆనందాన్ని పెంపొందించడమే కాకుండా, తమ సంస్కృతిపై గౌరవాన్ని మరియు ఐక్యత భావాన్ని బలపరుస్తాయని తెలిపారు. ఉగాది వంటి పండుగలు కొత్త ఆశలు, ఆనందం మరియు సానుకూల ఆలోచనలకు నాంది పలుకుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసంతో పాటు సాంస్కృతిక విలువలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు.
వేడుకల భాగంగా ద్రావిడ సాంస్కృతిక ర్యాంప్ వాక్ నిర్వహించబడింది. ఇందులో వివిధ ద్రావిడ సమాజాల సంప్రదాయ దుస్తులు మరియు సంస్కృతిని ప్రదర్శించారు. బోధన మరియు బోధనేతర సిబ్బంది కూడా కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వేడుకను మరింత విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపి, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని సృష్టించడంతో పాటు సాంస్కృతిక అవగాహన మరియు ఐక్యతను పెంపొందించింది. ఈ కార్యక్రమాన్ని డిన్ ఎకడమిక్ అఫైర్స్ ఆచార్య శ్యామల గారు సమన్వయం చేశారు.
డా. పి. ఎస్. గణేష్ మూర్తి
ప్రజాసంబంధాల అధికారి
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం