చిట్యాలలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం
మండల పరిధిలో ఆదివారం (జూన్ 28) నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈసం వెంకటేశం పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు పల్స్ పోలియో నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ మండల పరిధిలో 0 నుండి 5 సంవత్సరాల లోపు గల 2,872 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం మొత్తం 17 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశామని వివరించారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు మొత్తం 2,872 మంది చిన్నారులకు 17 పోలియో బూత్లకు ప్రతి బూత్కు నలుగురు చొప్పున ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు విధులు నిర్వహిస్తారని తెలిపారు.
0 నుండి 5 సంవత్సరాల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి, మండలంలో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సిబ్బందికి అధికారులు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఓ నర్సింగరావు, సూపర్వైజర్ వెంకటరమణమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.