BREAKING
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి
www.ntodaynews.com

ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడం అభినందనీయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 07:46 PM
100 వీక్షణలు

ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడం అభినందనీయం: మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఏప్రిల్ 6

నంద్యాల పట్టణంలో సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ  (ఎస్.హెచ్.జి.ఎస్) ప్రెసిడెంట్ సునీల్ కుమార్ మరియు 36 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ మరుతి ప్రసాద్ ఆధ్వర్యంలో నంద్యాల రైతు బజార్‌ నందు ఏర్పాటు చేసిన కూరగాయలు మరియు నిత్యవసర వస్తువుల స్టాల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా, సొసైటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్   మాట్లాడుతూ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొనుగోలు చేసి, పట్టణ ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన, కల్తీ లేని వస్తువులను అందించాలనే సొసైటీ నిర్ణయం మరియు ప్రతి కొనుగోలు వస్తువులపై బహుమతులు అందించడం ఎంతో సాహసోపేతమైనది మరియు ప్రశంసనీయమైనదని తెలిపారు . వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఈ స్టాల్స్‌ను నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ నాణ్యమైన కూరగాయలను అందించేందుకు కృషి చేస్తున్న సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ ప్రయత్నానికి పట్టణ ప్రజలందరూ తమ మద్దతు తెలపాలని మంత్రి ఫరూక్ కోరారు.

ఈ కార్యక్రమంలో సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, 36వ వార్డు టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్,మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తులసి రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మాజీ కౌన్సిలర్ నాగార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు సుమలత , స్వామి నాయక్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమైక్య జనరల్ సెక్రటరీ సుధీర్, చంటి, సొసైటీ కార్యవర్గం వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ట్రెజరర్ శివచంద్రుడు, చంద్ర బోస్ , సతీష్, రఘునాథ్ రెడ్డి , వెంకట రమణయ్య, సాయిరాం,  మరియు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.