BREAKING
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్.
www.ntodaynews.com

ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడం అభినందనీయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 07:46 PM
67 వీక్షణలు

ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడం అభినందనీయం: మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఏప్రిల్ 6

నంద్యాల పట్టణంలో సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ  (ఎస్.హెచ్.జి.ఎస్) ప్రెసిడెంట్ సునీల్ కుమార్ మరియు 36 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ మరుతి ప్రసాద్ ఆధ్వర్యంలో నంద్యాల రైతు బజార్‌ నందు ఏర్పాటు చేసిన కూరగాయలు మరియు నిత్యవసర వస్తువుల స్టాల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా, సొసైటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్   మాట్లాడుతూ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొనుగోలు చేసి, పట్టణ ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన, కల్తీ లేని వస్తువులను అందించాలనే సొసైటీ నిర్ణయం మరియు ప్రతి కొనుగోలు వస్తువులపై బహుమతులు అందించడం ఎంతో సాహసోపేతమైనది మరియు ప్రశంసనీయమైనదని తెలిపారు . వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఈ స్టాల్స్‌ను నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ నాణ్యమైన కూరగాయలను అందించేందుకు కృషి చేస్తున్న సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ ప్రయత్నానికి పట్టణ ప్రజలందరూ తమ మద్దతు తెలపాలని మంత్రి ఫరూక్ కోరారు.

ఈ కార్యక్రమంలో సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, 36వ వార్డు టిడిపి ఇంచార్జ్ మారుతి ప్రసాద్,మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తులసి రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మాజీ కౌన్సిలర్ నాగార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు సుమలత , స్వామి నాయక్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమైక్య జనరల్ సెక్రటరీ సుధీర్, చంటి, సొసైటీ కార్యవర్గం వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ట్రెజరర్ శివచంద్రుడు, చంద్ర బోస్ , సతీష్, రఘునాథ్ రెడ్డి , వెంకట రమణయ్య, సాయిరాం,  మరియు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.