www.ntodaynews.com
ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు పంటల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.