పుంగునూరు టిడిపి పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి ప్రజా దర్బార్
పుంగనూరులో టీడీపీ ప్రజా దర్బార్.. ప్రజా సమస్యలపై చల్లా రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి
పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శ్రీ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా చల్లా రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాల్లో నెలకొన్న రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, ఇళ్ల సమస్యలు, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను చల్లా రామచంద్రారెడ్డి ఓపికగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా, సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ప్రజా దర్బార్కు భారీగా ప్రజలు తరలిరావడంతో కార్యక్రమం సందడిగా సాగింది. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్న చల్లా రామచంద్రారెడ్డి తీరుపై పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు.