www.ntodaynews.com
తిరువూరులో ఘనంగా జాతీయ వృద్ధుల దినోత్సవం.. 40 మంది వృద్ధులకు చీరల పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలంలో జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరువూరులోని ఐడియాస్ సేవా సంస్థ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వయోవృద్ధులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు.
తిరువూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ, అశోక్ నగర్, వడ్డెర కాలనీ, జంగాల కాలనీ, బైపాస్ రోడ్, మాలపల్లి ప్రాంతాలకు చెందిన 40 మంది వయోవృద్ధులకు చీరలు అందజేశారు. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉయ్యూరు అనసూయ, మానవ హక్కుల సంఘం కార్యదర్శి రాధమ్మ, హృదయ మేరీ రాణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వారు కోరారు.