విద్యార్థులపై దాష్టీకానికి సమాధానం చెప్పాలి....
విద్యార్థులపై దాష్టీకానికి సమాధానం చెప్పాలి.. డీసీపీ కార్యాలయానికి రాహుల్
ప్రజల పక్షాన ఇంత నిజాయితీగా.. నిర్భీతిగా పోరాడే నాయకులు ఎంతమంది?
న్యూఢిల్లీ: జంతర్మంతర్ వద్ద జూలై 20న విద్యార్థులపై చోటుచేసుకున్న పోలీసుల చర్యపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యకు గురైన విద్యార్థితో కలిసి ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన, ఘటనపై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై బలప్రయోగానికి అనుమతి ఇచ్చిందెవరో కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. విద్యార్థుల గొంతును అణచివేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
అధికార వ్యవస్థను ప్రశ్నిస్తూ, బాధితుల పక్షాన నిలబడే నాయకత్వం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పదవులు, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. సమస్య ఎదురైనప్పుడు బాధితుల వద్దకు వెళ్లి అండగా నిలిచే నాయకత్వమే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.