www.ntodaynews.com
ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుపతి జిల్లాలో అవినీతి అధికారిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. చేపల పెంపకం కోసం ఓ రైతుకు మంజూరైన రూ.50 లక్షల రుణానికి సంబంధించిన ఫైల్ను ముందుకు తీసుకెళ్లేందుకు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, రూ.3 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్డయ్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన అధికారులు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.