www.ntodaynews.com
మూడు లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
తిరుపతి | NTODAY NEWS
తిరుపతి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడిలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్య రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
చేపల పెంపకం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 లక్షల రుణానికి సంబంధించిన ఫైలు క్లియర్ చేయడానికి ఓ రైతు నుంచి రూ.6 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, రూ.3 లక్షలు లంచంగా స్వీకరిస్తున్న సమయంలో డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్యను రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.
ఘటన అనంతరం అధికారులు సంబంధిత కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.
ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.