BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

​రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు ​

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Jul, 2026 - 10:10 PM
58 వీక్షణలు

రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు

​జంగల్ నాలా ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి

​హైదరాబాద్: రంగదాములపల్లె చెరువు నిల్వ సామర్థ్యాన్ని (స్టోరేజీ కెపాసిటీ) పెంచి, కింద ఉన్న గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా జంగల్ నాలా ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

​నివేదిక అందజేత:

రంగదాములపల్లె చెరువు, జంగల్ నాలా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను, శాశ్వత పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రికి అందజేశారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను, వీటి వల్ల స్థానిక రైతులకు, ప్రజలకు చేకూరనున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

​సానుకూలంగా స్పందించిన మంత్రి:

మంత్రి లక్ష్మణ్ కుమార్ అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై సానుకూల ముందడుగు పడినట్లు సమాచారం. ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి పాల్గొన్నారు.