BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

​రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు ​

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Jul, 2026 - 10:10 PM
163 వీక్షణలు

రంగదాములపల్లె చెరువు సామర్థ్యం పెంపునకు కీలక ముందడుగు

​జంగల్ నాలా ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి

​హైదరాబాద్: రంగదాములపల్లె చెరువు నిల్వ సామర్థ్యాన్ని (స్టోరేజీ కెపాసిటీ) పెంచి, కింద ఉన్న గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా జంగల్ నాలా ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

​నివేదిక అందజేత:

రంగదాములపల్లె చెరువు, జంగల్ నాలా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను, శాశ్వత పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రికి అందజేశారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను, వీటి వల్ల స్థానిక రైతులకు, ప్రజలకు చేకూరనున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

​సానుకూలంగా స్పందించిన మంత్రి:

మంత్రి లక్ష్మణ్ కుమార్ అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై సానుకూల ముందడుగు పడినట్లు సమాచారం. ఈ సమావేశంలో పిసిసి డెలిగేట్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి పాల్గొన్నారు.