పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అదనపు కలెక్టర్ రాంప్రసాద్
ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశాల మేరకు శనివారం చిట్యాల మండలంలో సర్ 2026 కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ డిప్యూటీ కలెక్టర్ రాం ప్రసాద్ చిట్యాల మండలంలోని పోలింగ్ కేంద్రాల నెంబర్లు 101, 102 లతో పాటు, ఊరుమడ్ల గ్రామములోని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అర్హులైన అందరు ఓటర్ల నుండి ఎనుమరేషన్ ఫారాలను సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ఫారాలను రోజువారీగా నిర్దేశిత గడువులోగా డిజిటలైజేషన్ (ఆన్లైన్ నమోదు) ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో నల్గొండ ఓటరు నమోదు అధికారి మరియు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (యూనిట్-2) రమాదేవి చిట్యాల మండల సహాయ ఓటరు నమోదు అధికారి మరియు తహసీల్దార్ యం. విజయ్ కుమార్ ఎన్నికల ఉప తహశిల్దార్ మల్లిఖార్జున, సూపర్ వైజర్ అధికారి మరియు గిర్థవర్ జానీ షరీఫ్, పోలింగ్ కేంద్రం బిఎల్వోలు పాల్గొన్నారు