రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి : ప్రభుత్వ విప్ వేముల వీరేశం
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూర్ గ్రామం పాలసంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చికినమెట్ల భిక్షం,డైరెక్టర్లుగా ఎన్నికైన మందుల కృష్ణయ్య, కొండ వెంకటేశంలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా ఎన్నికైన పాలసంఘం పాలకవర్గం సభ్యులు స్థానిక నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలవగా అభినందించి మాట్లాడారు.రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పాలసంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందు కు కృషి చేయాలని సూచించారు. పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు అందించడమే నూతన పాలకవర్గం ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య, పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, మాజీ సర్పంచ్ గడకారి సైదులు, మాజీ ఉపసర్పంచ్ సురిగి లింగస్వామి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొండె శ్రీశైలం,పాలసంఘం మాజీ చైర్మన్ గుమ్మి వెంగల్ రెడ్డి, వార్డు సభ్యులు ఎరసాని ఎల్లయ్య, నాయకులు వలిగొండ నర్సింహ, టేకుల నర్సిరెడ్డి, బియ్యపు వెంకటేశం, బండ శేఖర్, కొండె వెంకటేష్, సురిగి జంగయ్య, బాతరాజు శ్రీను,ముడుపు వెంకట్ రెడ్డి, ఆదె లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.