BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

ప్రభుత్వ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Jul, 2026 - 07:40 PM
6 వీక్షణలు





ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చిట్యాల మండల విద్యాధికారి కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ​ఈ ధర్నాను ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు అరూరి ప్రణీత్, ముసుగు రవీందర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వారు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి, విద్యార్థినులందరికీ తక్షణమే రెండు జతల యూనిఫాంలు, పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు. మండలంలోని రెండు బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ట్రంకు బాక్సులు అందించడంతో పాటు, అక్కడ మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి అని,  విద్యార్థుల సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ బడుల్లో సమస్యలు మాత్రం తీరడం లేదు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం.అని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శశికుమార్, గోల్చింటూ, శివప్రసాద్, సంజయ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు.